Wednesday, December 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలులారీని ఢీకొట్టిన ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు..ప‌లువురికి గాయాలు

లారీని ఢీకొట్టిన ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు..ప‌లువురికి గాయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ప్రమాదం జరిగింది. ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు నార్కట్‌పల్లి వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో మేడ్చల్‌ ప్రాంతానికి చెందిన రామప్రభు (61), అనఘ (25) ఉన్నారు. వారిని నార్కట్‌పల్లి శివారులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -