Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూభారతితో సమస్యలు పరిష్కారం..

భూభారతితో సమస్యలు పరిష్కారం..

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్:  రాష్ట్రంలో గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి తో భూముల సమస్యలు పెరిగిపోయాయని, వాటిని పరిష్కరించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని నిజామాబాదు ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అమ్రాబాద్ లో జరిగిన భూ భారతి రెవిన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అధికారులకు అందజేశారు. అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం ఉండి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాధా భైనామా భూములకు భూ భారతి చట్టం తో పరిష్కారం దొరుకుతుందన్నారు. విస్తీర్ణం, పేర్లలో మార్పులు, చేర్పులు ఉన్న వారు సదస్సుల్లో దరఖాస్తులు అందించాలని సూచించారు. ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని, రైతుల భూముల అనేక సమస్యలకు భూ భారతి తో పరిష్కారo దొరుకుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం లో తహసీల్దార్ రామేశ్వర్, పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లోళ్ల సాయిరెడ్డి, నాయకులు రాజేష్, ముత్యం రెడ్డి, ఈదుళ్ల సాయిలు, ఈశ్వర్ నాయక్, డాన్ శీను, పెద్దోళ్ల సాయిరెడ్డి, ఏరా సాయిలు, కాంతి సుమన్, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -