- Advertisement -
ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఏ ఈ ఉదయ్ కిరణ్..
నవతెలంగాణ – రెంజల్ : వచ్చే విద్యా సంవత్సరంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం రూ.57 లక్షల వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఉదయ్ కిరణ్ తెలిపారు. పాఠశాల ఆవరణలో కంకర వేసి విద్యార్థులకు చదువుకోవడానికి అనుకూలంగా ఉండడానికి కొలతలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ డబ్ల్యూ ఐ డి సి టెండర్ల ద్వారా ఈ పనులను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాలికల పాఠశాలలోని చెడిపోయిన తలుపులు సీసీ రోడ్డు తదితర పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- Advertisement -