Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఖనిజాలను, భూములను కాపాడాలని నిరసన

ప్రభుత్వ ఖనిజాలను, భూములను కాపాడాలని నిరసన

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ : మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఎడ్ల బండితో నిరసన తెలిపిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గంగరామంద గ్రామానికి చెందిన రాజన్న అనే వ్యక్తి గ్రామంలో గల గుట్ట నుంచి అక్రమంగా మొరాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, అదేవిధంగా గతంలో గ్రామంలోని నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, వాటిని కొందరు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని తెలిపారు. అక్రమంగా అమ్ముకుంటున్న మోరం మ్యాపియను, పెదాల భూములను అమ్ముకుంటున్న వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎడ్ల బండితోతో రోడ్డుపై నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని అతన్ని సముదయించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img