- Advertisement -
సర్పంచులు కిషన్ యాదవ్, మోహన్ నాయక్
నవతెలంగాణ – రామారెడ్డి
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలన సర్పంచులు కిషన్ యాదవ్, మోహన్ నాయక్ మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు , ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లి, గోకుల్ తాండ మండల పరిషత్ పాఠశాలలో సర్పంచులు కిషన్ యాదవ్, మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



