నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల పరిధిలో ఇటీవలి కాలంలో దొంగతనానికి గురైన రెండు మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటిని బాధితులకు శుక్రవారం పోలీస్ స్టేషన్ లో అందజేసినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు చోరీకి గురైన బాధితులు సీఈఐఆర్ (సెంట్రల్ ఈక్విమెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా తమ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని వివరించారు.
చోరీ జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా దొంగతనమైన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించవచ్చని తెలిపారు. చోరి అయిన ఫోన్ ల వివరాలను సీఈఐఆర్ పోర్టల్ లో ఎంట్రీ చేసి రికవరీలో సహాయపడిన మహిళ పోలీస్ కానిస్టేబుల్ జి. వసుధ ను ఎస్ఐ అనిల్ రెడ్డి అభినందించారు. పోగొట్టుకున్న తమ ఫోన్లను రికవరీ చేసి అందించిన ఎస్ఐ అనిల్ రెడ్డికి ఈ సందర్భంగా బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
బాధితులకు సెల్ ఫోన్ల అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES