- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ముందు సైన్యసేన ఆధ్వర్యంలో ఉచిత త్రాగు నీరు ఏర్పాటుచేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఆర్డీవో తాసిల్దార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, మంచి నీటికోసం ఎవరూ ఇబ్బంది పడొద్దని ఉద్ధేశ్యంతో ఈ సౌకర్యం కల్పించినట్టు సైన్య సేన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎర్రోళ్ల నరేష్ తెలిపారు.
- Advertisement -



