నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 36 అర్జీలను, జిల్లా కలెక్టర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలసి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్టేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 15 ,జిల్లా పంచాయతీ 8, గ్రామీణాభివృద్ధి శాఖ 7,ఇరిగేషన్, జిల్లా పరిషత్,మున్సిపాలిటీ,విద్య, ఆర్.టి.సి, ఫైర్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగి రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి,హౌసింగ్ పి.డి విజయసింగ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



