నవతెలంగాణ – పెద్దవూర
అంగన్వాడీ కేంద్రాలలోనే లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని ఐసీడీఎస్ సూపర్ వైజర్ శశికళ అన్నారు. శుక్రవారం మండలంలోనిఈదుల గూడెం అంగన్వాడీ కేంద్రం లో చాచా జన్మదిన దినోత్సవం సందర్బంగా బాలల దినోత్సవం జరువు కొని, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాలు, మహిళలపై హింస, లింగ వివక్షపై గ్రామం లోని అంగన్వాడీ లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. భేటీ బచావో, బేటీ పఢావో, బాల్యవివాహాలు నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ పై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్ల రక్షణ, ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలలోనే నాణ్యమైన పౌష్టికాహారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



