Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం

నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ లో రైతు వేదిక యందు నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం” అనే వినూత్న కార్యక్రమం ద్వారా పంట సాగులో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రను గుర్తించి, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం “నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం” అనే వినూత్న కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులకు వరి విత్తనాలు మరియు మొక్క జొన్న విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని వాడినపుడు దిగుబడులు కనీసం 10-15 శాతం వరకు పెరిగే అవకాశాన్ని రైతులకు తెలియజేయడం. రైతులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా సేకరించి, కొన్ని సాగు సాంకేతికతలను పాటిస్తే అదే విత్తనాన్ని 2-3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో ఎంపికైన ముగ్గురు నుండి ఐదుగురు అభ్యుదయ రైతులకు వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేసిన నాణ్యమైన విత్తనం అందించబడుతుంది. ఎంపికైన రైతులకు విత్తనోత్పత్తిపై వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందించబడతాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి రాజు, మద్నూర్ మండల మార్కెటింగ్ వైస్ చైర్మన్ పరమేష్ , మారుతి టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, తహసీల్దార్ ముజిబ్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు , నాయకులు వట్నాల రమేష్ , హన్మండ్లు స్వామి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సౌమ్య, సంయుక్త, సరోజ, అనిల్, సంపత్, విశాల్ మరియు మండల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -