మెరిసిన కరుణ్, జురెల్
భారత్-ఏ తొలి ఇన్నింగ్స్ 213/3
నార్తంప్టన్ (ఇంగ్లాండ్) : ఇంగ్లీశ్ గడ్డపై మంచి రికార్డున్న వికెట్ కీపర్, బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్ లయన్స్తో భారత్-ఏ రెండో అనధికార టెస్టులో కదం తొక్కాడు. అజేయ అర్థ సెంచరీ సాధించిన కెఎల్ రాహుల్ భారత్ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ లయన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (17, 26 బంతుల్లో 2 ఫోర్లు) క్రిస్ వోక్స్ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించాడు. దీంతో 28 పరుగులకే భారత్-ఏ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (93 నాటౌట్, 143 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో మెరిశాడు. వర్షం, తడి అవుట్ఫీల్డ్తో ఆటకు అంతరాయం కలిగినా రాహుల్ ఏకాగ్రత కోల్పోలేదు. ఆరు ఫోర్లతో 102 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రాహుల్.. సెంచరీ దిశగా సాగుతున్నాడు. తొలి మ్యాచ్లో మెరిసిన కరుణ్ నాయర్ (40, 71 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకునే ఇన్నింగ్స్ నమోదు చేశాడు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11, 13 బంతుల్లో 2 ఫోర్లు) ఇన్నింగ్స్ను ధాటిగా మొదలెట్టినా.. వికెట్ నిలుపుకోలేదు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (37 నాటౌట్, 60 బంతుల్లో 4 ఫోర్లు) నిలకడగా పరుగులు రాబట్టాడు. కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్ నాల్గో వికెట్కు అజేయంగా 87 పరుగులు జోడించారు. తొలి రోజు ఆటలో టీ విరామ సమయానికి భారత్-ఏ 52 ఓవర్లలో 213/3 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ లయన్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (3/30) మూడు వికెట్లతో విజృంభించాడు.
రాణించిన రాహుల్
- Advertisement -
- Advertisement -