- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రైలు ప్రయాణాల్లో అనిశ్చితిని తొలగించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 10 గంటల ముందే ప్రయాణికులు తమ టికెట్ స్టేటస్ను చూసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను మరింత సజావుగా ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు నాలుగు గంటల ముందు చార్టు అందుబాటులో ఉండేది. ఇప్పుడు దానిని 10 గంటల ముందుకు మార్చింది.
- Advertisement -



