- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉదయమంతా ఎండ ఠారెత్తించినా.. సాయంత్రం సమయానికి చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. కొండాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రాంనగర్ , బాగ్ లింగంపల్లి, అంబర్ పెట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడటంతో రోడ్లపై నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
- Advertisement -