- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కామారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Advertisement -



