- Advertisement -
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్
ముంబయి : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ ఆఖరు గ్రూప్ దశ మ్యాచ్ వరుణుడి ఖాతాలో పడింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 27 ఓవర్లకు కుదించారు. తొలుత బంగ్లాదేశ్ 27 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధ (3/30), శ్రీచరణి (2/23) రాణించారు. ఛేదనలో భారత్ 8.4 ఓవర్లలో 57/0తో ఉండగా వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. భారత్, బంగ్లాదేశ్ పాయింట్లు పంచుకున్నాయి. ప్రపంచకప్ తొలి సెమీస్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పోటీపడనుండగా.. గురువారం జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
- Advertisement -



