- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గువాహటి వేదికగా భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్కు వానతో ఆటంకం ఏర్పడింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం మొదలవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. 10 ఓవర్లకు టీమిండియా 1 వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 8 పరుగులు చేసి ఔటవగా, ప్రతీకా రావల్ (18 నాటౌట్), హర్లీన్ డియోల్ (15 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ స్కోరును పెంచుదామనుకునేలోపే వర్షం మొదలైంది.
- Advertisement -