Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవచ్చే ఐద్రోజులు వర్షాలు

వచ్చే ఐద్రోజులు వర్షాలు

- Advertisement -

– 21 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
– శుక్రవారం 220కిపైగా ప్రాంతాల్లో వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు, పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. ఈ మేరకు 21 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. శనివారం నాడు నిర్మల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షం కురిసే సూచనలున్నాయని తెలిపారు. ఆది, సోమ, మంగళ వారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.
రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 220కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం పాలడుగులో అత్యధికంగా 7.85 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా కొమురవెళ్లిలోనూ 6.67 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. వనపర్తి, సూర్యాపేట, మెదక్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, జగిత్యాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -