- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్ సూచించారు. గురువారం గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాల పరిధిలో పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అనారోగ్యం కలిగిన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వార్డెన్ వనిత, సూపర్వైజర్ జానకమ్మ, ఆశా మంజుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -