క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీకు నిలువెత్తు రూపం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
రామోజీకి ఘన నివాళి
నవతెలంగాణ – సిరిసిల్ల
పద్మవిభూషణ్ రామోజీరావులోని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ ఎప్పటికీ స్పూర్తిదాయకమని, ఆయన నాకు స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. చంద్రయాన్ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రామోజీరావు వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో రామోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పద్మవిభూషణ్ రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని మరువలేం. చంద్రయాన్ ను విజయవంతంగా ప్రయోగించిన రోజు రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీరావును దాదాపు 3 గంటలపాటు గడిపిన క్షణాలు ఇంకా నా కళ్ల ముందే మెదులుతున్నాయి. ఆయనను కలిసిన ప్రతిసారి జరిగే చర్చలు ఎంతో ఆసక్తిగా ఉండేవి. ఆయనలోని నిజాయితీ, క్రమశిక్షణ, దూరద్రుష్టి, అనుకున్నది సాధించే వరకు మొండి పట్టుదలతో వ్యవహరించే తీరు నాకెప్పటికీ స్పూర్తిదాయకం అని సంజయ్ అన్నారు. రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నామని, రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని, రామోజీ మనమధ్య లేకపోయినా ఆయన స్మృతులు, ఆశయాలు సజీవంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, రాగుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామోజీరావు మాకు స్పూర్తిదాయకం: బండి సంజయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES