Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకులంలో ఎలుకల కలకలం

గురుకులంలో ఎలుకల కలకలం

- Advertisement -

– 8 మంది విద్యార్థులను కరిసిన వైనం
– మెదక్‌ జిల్లా నారాయణపూర్‌లో ఘటన
నవతెలంగాణ-నర్సాపూర్‌

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం నారాయణపూర్‌ గ్రామ శివారులోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులను ఎలుకలు కరవడం కలకలం రేపింది. గురువారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో 8 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి హాస్టల్‌ భవనంలో నిద్రిస్తున్న సమయంలో విద్యార్థి నులు నిఖిత, జ్యోతి, ఉష, గీతాంజలి, సంధ్య, అశ్విత, మరో ఇద్దరిని ఎలుకలు కరిచాయి. ఈ విషయాన్ని వెంటనే ఉపాధ్యాయులకు తెలపడంతో.. వారిని నర్సా పూర్‌ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. కాగా, హాస్టల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల భద్రత విషయంలో ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై ప్రన్సిపల్‌ లలితాదేవి మాట్లాడుతూ.. విద్యార్థులకు కాళ్లపై నుంచి ఎలుకలు పోయి.. కరిచిన విషయం వాస్తవమేనని అన్నారు. వెంటనే స్పందించి వారిని హాస్పటల్‌కు తరలించి చికిత్స చేయించినట్టు చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -