- Advertisement -
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఆర్బిఐ గవర్నర్ సంజరు మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగనున్న ఈ మానిటరింగ్ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ నిర్ణయాలను శుక్రవారం మీడియాకు వెల్లడించనున్నారు. ఈ దఫా కూడా కీలక వడ్డీ రేట్లలో కోత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం 4 శాతం దిగువన కొనసాగుతోన్న నేపథ్యంలో దేశ వృద్ధికి మద్దతిచ్చేందుకు ఆర్బిఐ సానుకూల నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. ఇంతక్రితం రెండు భేటీల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపోరేటుకు కోత పెట్టింది.
- Advertisement -