నవతెలంగాణ-హైదరాబాద్: RCB విజయోత్సవం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీస్ డిపార్ట్మెంట్ విచారణను వేగవంతం చేసింది. ఈ మేరకు ఆర్సీబీ టీమ్ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెను పోలీసులు ఇవాళ ఉదయం బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. అతడు ముంబాయ్కి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈవెంట్ నిర్వాహక సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ నిఖిల్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఈవెంట్ను కూడా DNA సంస్థతో కలిసి ఆయనే ఏర్పాటు చేసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నెల 5న ఆర్సీబీ చేపట్టిన విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు భారీ పోటెత్తారు. దీంతో ఒక్కసారిగా జనాల మధ్య తోపులాటలో 11మంది మృతి చెందగా, మరో 50మందిపైగా గాయపడ్డారు.
సిద్దరామయ్య సర్కార్ కూడా ఈ దర్ఘటనపై జ్యూడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నివివేదికగా ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీనిలో భాగంగాలో ఇప్పటికే పలువురి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ శాఖాలో ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై ఆరాష్ట్ర హైకోర్టు కూడా సీరియస్ అయింది. సుమోటోగా కేసును స్వీకరించి…విచారించిన విషయం తెలిసిందే.