Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూమి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తుల స్వీకరణ

భూమి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
భూమి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మండలంలోని పెద్ద మల్లారెడ్డి సొసైటీ చైర్మన్ రాజా గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఈవో మోహన్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పైలెట్ ప్రాజెక్టు భూ భారతి కార్యక్రమంలో భాగంగా రైతుల భూమి సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. 70 మంది రైతులు భూమి సమస్యలు పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరించినట్లు సీఈవో తెలిపారు. ఈ దరఖాస్తులను జిల్లా అధికారులకు అందజేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, గ్రామ రైతులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -