- Advertisement -
న్యూఢిల్లీ : రిలయన్స్ పవర్ లిమిటెడ్ బోర్డ్ తాజాగా రూ.9,000 కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను ఈక్విటీ, నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల ద్వారా క్యూఐపి లేదా ఇతర పద్ధతుల ద్వారా సేకరించనున్నారు. ఈ నిధులు పునరుత్పాదక శక్తి విస్తరణ, కొత్త వ్యాపార అవకాశాలు, వర్కింగ్ క్యాపిటల్ కోసం ఉపయోగించబడతాయని ఆ కంపెనీ తెలిపింది.
- Advertisement -