నవతెలంగాణ–ముధోల్ : హైదరాబాదులోని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆమె స్వగృహంలో బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమ్మయి రమేష్ ఆదివారం కలిసి బాసర దేవస్థానం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి నిసన్మానించి బాసర సరస్వతి ప్రసాదంను అందజేశారు.ఆనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ ను త్వరలో ఆమోదింప చేసి పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు.అలాగే రాబోయే ఆషాడమాసం సందర్భంగా బాసర లో మహా కాళి అమ్మవారి వద్ద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బోనాల ఉత్సవ ఏర్పాట్ల ను ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరారు . మంత్రి సానుకూలంగా స్పందించి , రెండు ,మూడు రోజుల్లో మహాకాళి అమ్మవారి బోనాలను అధికారికంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున జీవో జారీ చేస్తామని తెలిపారని ఆయన చెప్పారు.అతి త్వరలో అమ్మవారి ఆలయ అభివృద్ధిపై బాసర లోనే ఇన్చార్జి మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు.
బాసర ఆలయం అభివృద్ధి చేయాలని మంత్రికి వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES