- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మంచినీటి సమస్య తీర్చాలి అని నవతెలంగాణలో గురువారం వార్త కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించారు. సబ్ కలెక్టర్ మాయాక్ సింగ్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి గ్రామస్తులను నీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు గత 15 రోజుల నుండి నీరు మురికిగా వస్తుందని అధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు 20వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ను గ్రామస్తులకు అందించి ప్రతిరోజు మూడుసార్లు ఫీల్డింగ్ చేసి నీటిని సప్లై చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, గ్రీడ్ ఏఈ,ఎంపీ ఓ, కార్యదర్శి తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -