నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రైతుల భూ సమస్యల పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ జయంత్ కుమార్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని బదనపల్లి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయా గ్రామాల రైతులు వారి సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జయంత్ కుమార్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధరణిలో జరిగిన అవకతవకలు,రైతులు అనేక సమస్యల్లో కూరుకుపోయారని ఆ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసిందన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజిటల్ సైన్, సాదా బయనామ వంటి సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES