- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు నూతన సారథిగా ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను యాజమాన్యం ఖరారు చేసినట్లు సమాచారం. గత సీజన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్థానాన్ని పరాగ్ భర్తీ చేయనున్నారు ఐపీఎల్-2025 సీజన్లో గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో 8 మ్యాచ్లకు పరాగ్ నాయకత్వం వహించారు. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర సూచన మేరకు పరాగ్కు జట్టు పగ్గాలను అప్పగించినట్లు సమాచారం.
- Advertisement -



