Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంకర్నాటకలో రోడ్డు ప్రమాదం

కర్నాటకలో రోడ్డు ప్రమాదం

- Advertisement -

నలుగురు తెలంగాణవాసుల మృతి
సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మండలానికి చెందిన వారిగా గుర్తింపు


మానూర్‌ : కర్నాటకలోని హల్లిఖేడ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (40), రాచప్ప (45), కాశీనాథ్‌ (60), నాగరాజు (40)గా గుర్తించారు. వీరంతా గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు బంధువులు చేరుకున్నారు. తమకు దిక్కెవరంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -