Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబైక్ ను ఢీకొట్టిన కారు..మహిళ మృతి

బైక్ ను ఢీకొట్టిన కారు..మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : చంచల్‌గూడ చౌరస్తా వద్ద రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా వచ్చిన ఓ కారు మలుపు వద్ద బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై భార్యాభర్తలతో పాటు రెండేళ్ల కూతురు ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు ఢీకొని బైకర్‌ భార్య సీమాబేగం ప్రాణాలు కోల్పోగా.. భర్తతో పాటు కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. కారు బైక్‌పై నుంచి దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. కారు నడిపిన వ్యక్తిని మాదన్నపేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad