Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -


నవతెలంగాణ – హైదరాబాద్ : పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కొత్త సర్పంచ్లకు పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేసేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని చెప్పారు. కొత్త ఏడాదిలో మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు గ్రామాల్లో సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఉపయోగించాలన్నారు. తన రాజకీయ ప్రయాణంలో కొడంగల్ ప్రజల సహకారాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, “2009 నుంచి మీరు నన్ను మీ భుజాలపై మోశారు. మీ నమ్మకమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని అన్నారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

గ్రామాల్లో వివక్ష లేకుండా పాలన సాగాలని, పార్టీలు-పంతాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సర్పంచ్‌లకు సూచించారు. గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సీఎం కోరారు. పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం ముందుకు సాగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా గ్రామాలే దేశానికి వెన్నెముక అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -