- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో నేతన్నలకు ఊరటనిచ్చే భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జియో ట్యాగ్ చేసిన మగ్గాలతో పని చేసే నేతన్నలకు రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 ప్రోత్సాహకం ప్రభుత్వం అందజేయనుంది. ఈ సహాయాన్ని ఏడాదికి రెండు విడతలుగా ఇవ్వనున్నారు. దీంతో సుమారు 40 వేల మంది చేనేత కార్మికులు లబ్ది పొందనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.48 కోట్ల బడ్జెట్ను కేటాయించింది.
- Advertisement -