Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు

తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు

- Advertisement -

– రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
– ఇది ప్రజాప్రభుత్వ ఘనత
– ‘ రైతు భరోసా’ పై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన సోమవారం జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ కో ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసాను ప్రజా ప్రభుత్వం రైతులకు అందించిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంట్‌, సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌, పేదలకు సన్నబియ్యం వంటి పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు.
రైతుభరోసా అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అమలు చేస్తున్నట్టు చెప్పారు. గతంలో ఎకరాకు రూ.10 వేలుంటే రూ.2 వేలు పెంచి రూ.12 వేల చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కోటి 49 లక్షలా 39 వేలా 111 ఎకరాలకు రైతు భరోసా అందుతున్నట్టు చెప్పారు. గతంలో 5, 10 ఎకరాలకు మాత్రమే అని పరిమితులు ఉండేవన్నారు. ప్రజా ప్రభుత్వంలో అవేమీ లేకుండా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా ఇస్తున్నట్టు తెలిపారు. ‘రైతు భరోసా’ చెల్లింపును 9 రోజుల్లోనే పూర్తి చేసినట్టు ప్రకటించారు. 16న మొదలు పెట్టామనీ, 24తో పూర్తవుతుందని తెలిపారు. ముగింపు రోజున రైతు వేదికల వద్ద రైతులను సమావేశ పరిచి, సచివాలయం నుంచి సీఎం, మంత్రులు సందేశాలిస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమన్వయంతో పని చేయాలి :మీనాక్షి నటరాజన్‌
పార్టీలో సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో కలిసి పని చేయాలని ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు జై సంవిధాన్‌ కార్యక్రమంపై అవగాహన పెంచాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులదేనని గుర్తుచేశారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ 24న మండల కేంద్రాల్లో సంబురాల్లో రైతులను భాగస్వా ములను చేయాలని నాయకులకు సూచిం చారు. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధం తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -