మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్..
నవతెలంగాణ – పరకాల : పరకాల పట్టణంలోని మొదటి వాడలో నెలకొన్న సమస్యలతో పాటు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి దూషించి సంపత్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురిసి నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున దోమల నివారణ మందు పిచికారి చేయించాలన్నారు. ఆయిల్ బాల్స్ తయారు చేసి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో వేయడం లాంటి ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ పేర ఇన్వార్డ్ సెక్షన్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది.
స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త క్రమము తప్పకుండా సేకరించాలన్నారు. మురికి కాలువలు ఎప్పటికప్పుడు తీపించాలని, తీపించిన చెత్త కుప్పలను వెంటనే ఎత్తి డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు. మురికి కాలువల వెంట ఉన్న, రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని అంటువ్యాధులు రాకుండా, దోమల ద్వారా సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, చికెన్ గున్యా, డయేరియా తదితర వ్యాధుల బారిన పడకుండా దోమల మందు పిచికారి చేపించాలన్నారు.
నల్లాల ద్వారా అందిస్తున్న నీళ్లలో బ్లీచింగ్ వేయించాలని మురికి కాలువల వెంట, దుర్వాసన వస్తున్న ప్రదేశాలలో బ్లీచింగ్ చల్లించాలని వార్డులో వీధిలైట్లు వెలుగనిచోట వెంటనే వీధిలైట్లు వెలిగించాలని కోరారు. వీధిలైట్లు వెలిగించే టైమర్లు వెంటనే రిపేర్ చేపించాలని ప్రజల సౌకర్యార్థం సానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని, ప్రజలు ఆరోగ్యంగా జీవించేలా పరిశుభ్రత పాటించాలని మాజీ కౌన్సిలర్ కోరారు.