- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని శాంభవి హైస్కూల్లో శుక్రవారం సంక్రాంతి పర్వదిన సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు పతంగులను తయారుచేసి ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థినిలు రంగవల్లులతో ముగ్గులను వేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులను అందించారు. విద్యార్థులు పండుగ సాంప్రదాయ ముట్టిపడేలా వస్త్రధారణలో అలరించారు. కార్యక్రమంలో చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ బొట్ల రవీణ్ ప్రసాద్, ప్రిన్సిపల్ బొట్ల ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ బొట్ల మంజుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



