మా మాతమూర్తీ, మహానటీ సావిత్రి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు ‘సావిత్రి మహౌత్సవ్’ పేరిట నిర్వహిస్తున్నాము. ప్రముఖ కళా సంస్థ ” సంగమం” ఫౌండేషన్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో ‘మహానటి’ చిత్ర దర్శక, నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నాదత్ , ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తక రచయిత సంజరు కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కష్ణయ్య లను ప్రత్యేకంగా సత్కరిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు’ అని సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి చెప్పారు.
డిసెంబర్ 6న సావిత్రి 90వ జయంతి సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



