- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తున్నారు. సర్పంచ్ ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నిక చేపడతారు.
- Advertisement -



