- Advertisement -
నవతెలంగాణ – వర్ధన్నపేట
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. వరంగల్ జిల్లా పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, నల్లబెల్లి,ఇల్లంద గ్రామాలలో పోలీసు సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ ఐ సాయిబాబు , రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -


