- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్ : 35 వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డి పోటీలకు ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికైనారు.యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ జరిగిన జిల్లా స్థాయిలో ఎల్ ధనుష్,ఆర్.మనోజ్ కుమార్,టి.కార్తీక్, బి.చండేశ్వర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనారు.ఈనెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిజాంబాద్ జిల్లా ముష్కర్ లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో పాల్గొంటారు.సోమవారం రోజున పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్,ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్ మాదాను జోసెఫ్ శిక్షణను కొనియాడుతూ అభినందించారు.
- Advertisement -