- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేటీఆర్ పై బీఆర్ఎస్ మహిళా నేత ఆశా ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయం కోసం ఏ గడ్డి అయినా కేటీఆర్ తింటాడని ఆశా ప్రియ ఫైర్ అయ్యారు. తనపై నీచంగా పోస్టు వేసిన వ్యక్తితో ఫోటో దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాషా అనే వ్యక్తి తనపై అసభ్యకర పోస్టు వేశాడన్న ఆశా ప్రియ… కేటీఆర్ ను ఉద్దేశించి మండిపడ్డారు. ఇప్పుడు అదే వ్యక్తితో కేటీఆర్ ఫోటో దిగి ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు బాధిత మహిళ ఆశా ప్రియ. మరోవైపు రాజకీయ కారణాలతోనే ఆశా ప్రియ ఆరోపణలు చేస్తోందన్న పాషా.. ఆమెపై ఆగ్రహిస్తున్నారు. మరి దీనిపై బీఆర్ ఎస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
- Advertisement -