- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్లో ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైది సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. గత శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల జరిపారు. హైది ఇటీవల భారతదేశ మ్యాప్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈక్రమంలో ఆయన మృతితో బంగ్లాదేశ్లో గురువారం అర్ధరాత్రి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. చెత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయంతో పాటు పలుచోట్ల నిరసనకారుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
- Advertisement -



