- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత 6 నెలలుగా రేషన్ తీసుకోని 1.59 లక్షల కార్డులపై విచారణ చేపట్టాలని పౌర సరఫరాల అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని సమాచారం. ఇప్పటికే 80శాతం కార్డులను పరిశీలించిన అధికారులు వీటిలో 30 శాతం అర్హత లేనివని గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉండటం, కార్డు హోల్డర్లు మరణించడం, డూప్లికేట్ ఆధార్ కార్డులు పొందడం వంటి లోపాలు ఉన్నాయని గుర్తించారు. వీటిలో చాలా కార్డులు రద్దు చేసే అవకాశముందని తెలుస్తుంది.
- Advertisement -