- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో శుక్రవారం కాల్పుల కలకలం రేగింది. మోంటానా రాష్ట్రంలోని అనకొండ నగరంలో ఉన్న ఓ బార్లో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిందితుడిని మైఖేల్ పాల్ బ్రౌన్గా గుర్తించిన పోలీసులు, అతని ఫోటోను విడుదల చేసి ఆయుధంతో ఉన్నాడని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
- Advertisement -