కేంద్ర హౌంమంత్రి అమిత్షాకు భట్టి, తుమ్మల విజ్ఞప్తి
రూ.5,018.72 కోట్లు నష్టంగా ప్రాథమిక అంచనా
గత, ప్రస్తుత సాయం కింద రూ.16,732 కోట్లు తక్షణమే ఇవ్వాలి
త్వరలోనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపుతాం : అమిత్షా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. తాజా ప్రాథమిక అంచనా ప్రకారం… రూ.5,018 కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గత విపత్తు, తాజా ప్రకృతి విలయాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తం రూ.16,732 కోట్ల ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షాతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. ఈ సందర్భంగా వరద నష్టంగాపై ప్రాథమిక అంచన నివేదిక, వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని వివరించారు. కేంద్రం తక్షణమే సాయం అందించాలని కోరారు. ఆగస్టు 25 నుంచి 28 మధ్య తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని వివరించారు. ప్రధానంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి భారీ నష్టం జరిగిందన్నారు. ఈ జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25 శాతం అధికంగా ఉందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఎనిమిది జిల్లాల్లో 65 నుంచి 95 శాతం అదనపు వర్షపాతం నమోదైందని వివరించారు. వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో మనుషులతో పాటు మూగ జీవులు, పశువులు ప్రాణాలు కోల్పోయాయన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు, పంట పొలాలకు నష్టం వాటిల్లిందన్నారు.
గతంలోనూ నిధులివ్వలే
గతంలోనూ రాష్ట్రంలో భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం సహకరించలేదని గుర్తు చేశారు. గతేడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా భారీ నష్టం జరిగిందన్నారు. వరద నష్టం కింద రాష్ట్రానికి రూ.11,713 కోట్ల ఆర్థికసహాయం కోరినప్పటికీ… కేంద్రం నుంచి నిధులేమీ ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా… కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు. దీంతో పరిస్థితులు చక్క దిద్దడంలో, పునర్నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తాయని అమిత్ షాకు వివరించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని గతంలో కోరిన రూ.11,713 కోట్లతోపాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం… రూ.5,018 కోట్లు మొత్తం కలిపి రూ.16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం నేతత్వంలోని బృందం అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది.
కేంద్ర బృందాలను పంపండి
72 గంటలపాటు కురిసిన వర్షాల తీవ్రతతో రోడ్లు, రైల్వే ట్రాక్లు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం భట్టి వివ రించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా సాధారణ జీవన విధా నానికి అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర హౌం మంత్రిని కోరారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో 22 మంది మృతి చెందారని, పాడి పశువులు చనిపోయాయని, గృహ, పంట నష్టాల గణన కొనసా గుతోందని తెలిపారు. కావున, తక్షణమే.. తెలంగాణ కు కేంద్ర బృందాలను సత్వరమే పంపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తిపై అమిత్ షా సానుకూలంగా స్పందించిట్టు అధికారులు తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అధికా రుల బృందాన్ని తెలంగాణకు పంపి నష్టాలను అంచనా వేయిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
అమిత్షాకు అందజేసిన ప్రాథమిక అంచనా నివేదిక
మౌలిక సదుపాయాల నష్టాలు (రూ.కోట్లలో)
(ప్రాథమిక అంచనాల ప్రకారం)
- అత్యవసర మరమ్మతులకు తక్షణ నిధుల అవసరం
- రూ.1,500
- మున్సిపల్ పరిపాలన – రూ.1,025
- రోడ్లు (ఆర్ అండ్ బీ) – రూ.785.59
- నీటిపారుదల – రూ.655.70
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.377.43
- ఇతర శాఖలు / ప్రభుత్వ ఆస్తులు – రూ.300
- పంట నష్టం – రూ.236
- ఇంధన శాఖ (విద్యుత్) – రూ.40.73
- గహనిర్మాణ శాఖ – రూ.25
- మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం
- రూ.23.43
పశుసంవర్ధక శాఖ – రూ.10
మొత్తం (ప్రాథమిక అంచనాలు):
రూ.5,018.72
వైద్య , ఆరోగ్య శాఖ – రూ.14.84