కథానాయికగా సమంత ‘శుభం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఆమె ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ,’వైజాగ్కు వస్తే ప్రతీ సారి సినిమా బ్లాక్బస్టర్ అవుతోంది. వైజాగ్లో అభిమానుల్ని చూసి నాకు నిజమైన ప్రేమ ఏంటో అర్థమైంది. మా డైరెక్టర్ ప్రవీణ్ ఎనర్జీ చూసి నేను అంతా మర్చిపోయాను. నిర్మాతగా నేను ఓ కొత్త ఆలోచనతో ఈ ‘శుభం’ సినిమాను స్టార్ట్ చేశాను. కొత్త వారిత,ో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతో ట్రాలాలా ప్రొడక్షన్ బ్యానర్ను స్టార్ట్ చేశాను. అదే నా లక్ష్యం. మే 9న ఫ్యామిలీతో కలిసి మా మూవీని చూడండి. ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి చిరునవ్వుతో బయటకు వస్తారు’ అని అన్నారు. ‘ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు తెలుగులో ఇలాంటి కంటెంట్గాని, ఇలాంటి హారర్, కామెడీ జోనర్లో చిత్రాలు రాలేదు. సమంత లాంటి వారు లేకపోతే మా సినిమా ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు’ అని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల చెప్పారు.