- Advertisement -
నవతెలంగాణ నవాబు పేట: మండల కేంద్రములోని పలు ఫర్టిలైజర్ కేంద్రాలలో రైతు సేవా కేంద్రాల్లో మన గ్రోమోర్ కేంద్రంలో సంబంధించిన గోదాముల్లో నిల్వ ఉంచిన యూరియా స్టాక్ గుర్తించి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కీలక ఆదేశాలు జారీచేశారు అని ఎస్ఐ విక్రం తెలిపారు. మంగళవారం మండల కేంద్రములోని ఓ ఫర్టిలైజర్ కేంద్రాంలో ఉన్న గోదాంలో గుర్తించిన యూరియా యజమానికి అడిగిన రైతులకు సరిపడా యూరియా అమ్మాలని ఎస్పీ ఆదేశాలను అనుసరించాలని వారికి సూచించారు. రైతులకు యూరియా విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఫర్టిలైజర్స్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -