- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాశమైలారం సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతుల సంఖ్య 42కి చేరింది. తాజాగా డీఎస్ఏ పరీక్షలో ఇద్దరి అవశేషాలు గుర్తించారు. కాగా గల్లంతైన మరో 8మంది ఆచూకీ లభించాల్సి ఉంది. పేలుడు ధాటికి శరీర భాగాలన్నీ యంత్రాలకు అతుక్కుపోయాయి. దీంతో యంత్రాల నుంచి అవశేషాలను సేకరించి పరీక్షిస్తున్నారు. కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.
- Advertisement -