- Advertisement -
ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డికి నిర్వాసితుల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఉర చెరువు కట్టపై ఉన్న మూళ్ళ పొదలు, తుమ్మచెట్లను తొలగించి, చెరువు కట్టపై మట్టి పోయాలని ఏఎమ్మార్ నాయకులు అన్నారు. అలాగే ఎస్సికాలనిలోని పోచమ్మ రోడ్డుకు మట్టి ఇవ్వాలని కోరుతూ బుధవారం భూ నిర్వాసితులు దన్నపనేని అశోక్ రావు, కేశారపు చెంద్రయ్య, ఇందారపు చెంద్రయ్య, బొబ్బిలి రాజు గౌడ్, మాచర్ల సమ్మయ్య, అంగజాల రమేష్ కాపురం బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చెపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డికి విన్నవించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.
- Advertisement -