Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం47వ ఆల్‌ ఇండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ పోటీలో దక్షిణ మధ్య రైల్వే జట్టు విజయం

47వ ఆల్‌ ఇండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ పోటీలో దక్షిణ మధ్య రైల్వే జట్టు విజయం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
47వ ఆల్‌ ఇండియా రైల్వే కబడ్డీ (మహిళల) ఛాంపియన్‌షిప్‌ పోటీలో దక్షిణ మధ్య రైల్వే మహిళల కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది. దక్షిణ మధ్య రైల్వే జట్టు 25-19 తేడాతో సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేను ఓడించింది. శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో, దక్షిణ మధ్య రైల్వే మహిళల జట్టు సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేను ఓడించి 47వ ఆల్‌ ఇండియా రైల్వే మహిళా కబడ్డీ టోర్నమెంట్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఈ పోటీలో చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరై దక్షిణ మధ్య రైల్వే మహిళా జట్టుకు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని అందజేశారు. పాల్గొన్న జట్లకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఆయన విజేతలను అభినందించారు. అన్ని జట్ల క్రీడా స్ఫూర్తిని, నిజాయితీని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌ సత్య ప్రకాష్‌, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/స్టోర్స్‌, వర్క్‌షాప్‌ పి.కోటేశ్వరరావు, హైదరాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌ వర్మ, వివిధ విభాగాల ప్రధాన అధిపతులు, ఇతర సీనియర్‌ రైల్వే అధికారులు, క్రీడా సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వారు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ ఏడాది మొత్తం తొమ్మిది జట్లు సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, ఈస్టర్న్‌ రైల్వే, వెస్ట్రన్‌ రైల్వే, సెంట్రల్‌ రైల్వే, ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, ఆతిథ్య దక్షిణ మధ్య రైల్వే జట్లు లీగ్‌-కమ్‌-నాకౌట్‌ ప్రాతిపదికన అక్టోబర్‌ 7 నుంచి 10 వరకు నిర్వహించిన ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -