- Advertisement -
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి: రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారం నిమిత్తం ఈనెల 15 న ప్రత్యేక లోకాదాలత్ ను నిర్వహిస్తున్నట్లు మొదటి అదనపు జిల్లా జడ్జి మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జి .సంపూర్ణ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల జిల్లాలోని కక్షిదారులు ఈ నెల 15 న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ లో వారి పెండింగ్ కేసులు, ప్రీ లిటీగేషన్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
- Advertisement -



